హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) విద్యార్థుల డైట్చార్జీలను పెంచింది. ఇదివరకు విద్యార్థికి నెలకు రూ.1,049.54 ఇస్తుండగా, తాజాగా రూ.1,225కు పెంచారు. గతంతో పోల్చితే డైట్చార్జీలు రూ.176 పెరగడం విశేషం. అదేవిధంగా, కేజీబీవీలన్నింటిలోనూ కామన్ మెనూ అమలు చేయాలని విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఆదేశాలిచ్చారు.
డైట్చార్జీలు అమలు చేయకపోయినా, కామన్ డైట్ మెనూ పాటించకపోయినా కఠినచర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ఈ డైట్చార్జీలు వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలుచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో 475 కేజీబీవీలుండగా, వీటిల్లో 1,06,903 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.