హైదరాబాద్, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం వెయిటింగ్లో ఉన్న ఇద్దరు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్ ఇచ్చింది. పరిశ్రమల శాఖ డైరెక్టర్గా డీ కృష్ణ భాస్కర్ను నియమించిన ప్రభుత్వం ఎఫ్ఏసీగా ఉన్న నరసింహారెడ్డిని రిలీవ్ చేసింది. పురపాలక శాఖ డైరెక్టర్గా పమేలా సత్పతిని నియమించింది.
ఎఫ్ఏసీ బాధ్యతలు నిర్వరిస్తున్న సుదర్శన్ను రిలీవ్ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.