హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): అత్యవసర పరిస్థితులు, ప్రకృతి విపత్తుల సమయంలో తొలి స్పందనదారులు(ఫస్ట్ రెస్పాండర్స్)గా పనిచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ వలంటీర్లను రాష్ట్ర అగ్నిమాపకశాఖ ఎంపిక చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఔత్సాహికులైన 400 మందిని ఎంపిక చేసి.. అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణాలను ఎలా కాపాడాలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నది.
ఈ సందర్భంగా తెలంగాణ ఫైర్ డీజీ విక్రమ్సింగ్ మాన్ మాట్లాడుతూ.. వరదలు, భారీ అగ్నిప్రమాదాలు, ఇతర విపత్తుల సమయంలో అత్యవసర సేవలు చేరుకొనేలోపు సివిల్ డిఫెన్స్ వలంటీర్లు అన్ని శాఖలకు సమర్థవంతంగా సహకరించగలరని పేరొన్నారు.