అత్యవసర పరిస్థితులు, ప్రకృతి విపత్తుల సమయంలో తొలి స్పందనదారులు(ఫస్ట్ రెస్పాండర్స్)గా పనిచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ వలంటీర్లను రాష్ట్ర అగ్నిమాపకశాఖ ఎంపిక చేసింది.
కేంద్ర హోంశాఖ అందించే ప్రతిష్ఠాత్మక ‘బ్రోంజ్ డిస్క్' పురస్కారానికి రాష్ట్ర అగ్నిమాపక శాఖకు చెందిన 10 మంది ఎంపికయ్యారు. ఈ మేరకు అగ్నిమాపకశాఖ ఏడీజీ విక్రమ్సింగ్ మాన్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.