హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): కేంద్ర హోంశాఖ అందించే ప్రతిష్ఠాత్మక ‘బ్రోంజ్ డిస్క్’ పురస్కారానికి రాష్ట్ర అగ్నిమాపక శాఖకు చెందిన 10 మంది ఎంపికయ్యారు. ఈ మేరకు అగ్నిమాపకశాఖ ఏడీజీ విక్రమ్సింగ్ మాన్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా అగ్నిమాపక సేవలు, పౌర రక్షణ, హోమ్ గార్డ్స్ విభాగాల్లో అత్యుత్తమ విధి నిర్వహణ, అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి ఈ ఉన్నత స్థాయి గౌరవాన్ని అందజేస్తారని ఆయన తెలిపారు. ఈ గౌరవం సిబ్బందిలో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని, ప్రజలకు మరింత నిబద్ధతతో సేవలు అందించడానికి, సమాజంలో అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన పెంచడానికి ఇది ప్రేరణగా నిలుస్తుందని పేరొన్నారు.
పురసార గ్రహీతల వివరాలు: బీ సుధాకర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ (గౌలిగూడ, హైదరాబాద్), జీ యాదగిరి, లీడింగ్ ఫైర్ ఫైటర్ (సెక్రటేరియట్, హైదరాబాద్), ఎండీ గౌస్ పాషా, లీడింగ్ ఫైర్ ఫైటర్ (గద్వాల్), గడ్డే కృష్ణ ప్రసాద్, లీడింగ్ ఫైర్ ఫైటర్ (వైరా, ఖమ్మం), సారా రాజేశ్వర్, ఫైర్ ఫైటర్ టెక్నికల్ (హయత్ నగర్, రంగారెడ్డి), వగడాని రామ్ బాబు: ఫైర్ ఫైటర్ టెక్నికల్ (ఖమ్మం), కే వినోద్ కుమార్, ఫైర్ ఫైటర్ టెక్నికల్ (స్నారెల్, హైదరాబాద్), ఎం ప్రవితన్, ఫైర్ ఫైటర్ (గౌలిగూడ, హైదరాబాద్), జీ రాకేశ్ కుమార్, ఫైర్ ఫైటర్ (హైకోర్టు, హైదరాబాద్), జుట్టుకొండ వెంకటేశ్వర్లు, ఫైర్ ఫైటర్ (హుజూర్నగర్, నల్లగొండ).