హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ ) : నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)లో రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలు ఏటేటా డీలా పడుతున్నాయి. మొత్తం 1,099 డిగ్రీ కాలేజీలు ఉండగా ఎన్ఐఆర్ఎఫ్కు పోటీ పడేవి తక్కువగా ఉండటం గమనార్హం. వీటి సంఖ్య కేవలం సింగిల్ డిజిట్కే పరిమితమవుతున్నది. ఈ నేపథ్యంలో బుధవారం ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో మాసబ్ట్యాంక్లోని ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఆడిటోరియంలో వర్క్షాప్ నిర్వహించారు. మండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ తదితరులు పాల్గొని ర్యాకింగ్ మెరుగుపర్చడంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు పలు సమస్యలు లేవనెత్తారు.
2025లో ఆరు కాలేజీలే.. జాతీయంగా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాం కింగ్కు పోటీపడే కాలేజీల సంఖ్య పెరుగుతున్నది. గతంలో కాలేజీల సంఖ్య 3,500 మాత్రమే ఉండగా, ఇప్పుడది 8,500కు చేరింది. ర్యాంక్ రావడంతో కాలేజీల ప్రతిష్ట పెరుగుతున్నది. మెరుగైన ఫ్యాకల్టీ, ప్రతిభగల విద్యార్థులు కాలేజీలో చేరేందుకు పోటీపడతారు. ఏ కాలేజీ ఉత్తమమైనదో గుర్తించేందు కు ఈ ర్యాకింగ్ దోహదపడుతుంది. టాప్ ర్యాంకింగ్ కాలేజీల్లో ప్లేస్మెం ట్స్ డ్రైవ్లు చేపట్టేందుకు కంపెనీలు పోటీపడతాయి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాకిం గ్ కోసం 2025లో రాష్ట్రం నుంచి తక్కువ కాలేజీలు పోటీపడ్డాయి.