హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఓటరు జాబితా సవరణలో భాగంగా వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ ఆదేశించారు. సోమవారం బీఆర్కేఆర్ భవన్ నుంచి జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా సవరణపై సమీక్షించారు. ఓటరు జాబితాలో పేరు నమోదుతోపాటు చిరునామా మార్పు కోసం చేసుకున్న దరఖాస్తులను వెంటనే పరిశీలించాలని సూచించారు.
థర్డ్ జెండర్, 80 ఏండ్లకు పైబడినవారి దరఖాస్తుల్లో వివరాలను క్షు ణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డుల ప్రింటింగ్ వేగిరం చేయాలని సూచించారు. అత్యధిక వ్యయం అయ్యే నియోజకవర్గాలు, ప్రాంతాలను అంచనా వే యాలని ఆదేశించారు. జిల్లా ఇంటెలిజెన్స్ క మిటీతో తరుచూ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో అ డిషనల్ సీఈవో లోకేశ్కుమార్, జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.