హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): శాసనమండలి, శాసనసభ వర్షాకాల సమావేశాలు 4 రోజులపాటు (గురువారం నుంచి ఆదివారం వరకు) సాగాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు సహా మొత్తం 12 బిల్లులను ఉభయ సభలు ఆమోదించా యి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఇవే చివరి సమావేశాలుగా నిలువనున్నాయి.
సభ్యులకు మంత్రి ప్రశాంత్రెడ్డి కృతజ్ఞతలు
ఉభయసభల్లో వర్షాకాల సమావేశాలు 4 రోజులపాటు హుందాగా సాగాయని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ 26 గంటల 45 నిమిషాలు, మండలి 23 గంటల 10 నిమిషాలపాటు సమావేశమయ్యాయని వివరించారు. ఎలాంటి అవాంతారాలు, సభ్యుల సస్పెన్షన్లు లేకుండా ఈ సమావేశాలు సాగడం సంతోషంగా ఉన్నదని, ఇది రాష్ట్ర ప్రజల పట్ల సీఎం కేసీఆర్కు ఉన్న విశ్వసనీయతకు ప్రతిరూపమన్నారు. చారిత్రాత్మక ఆర్టీసీ విలీన బిల్లుతోపాటు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న అనేక నిర్ణయాలను ఉభయ సభలు ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశా రు. తొమ్మిదిన్నరేండ్లలో సాధించిన ప్రగతిపై జరిగిన చర్చలో అన్ని అంశాలపై సీఎం కేసీఆర్ 2 గంటల 20 నిమిషాలపాటు వివరణ ఇవ్వడం ఈ సమావేశాల ప్రత్యేకత అని స్పష్టం చేశారు. ఉభయ సభలను ఎంతో హుందాగా నడిపిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. సహకరించిన మంత్రులు, విప్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతోపాటు అసెంబ్లీ సిబ్బందికి, అన్ని శాఖ ల అధికారులకు, పోలీసులకు, మీడియాకు మంత్రి వేముల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామపంచాయతీలుగా రెండు మున్సిపల్ వార్డులు
బాన్సువాడలోని కొయ్యగుట్టతండా, ఆలేరులోని సాయిగూడెం వార్డులను మున్సిపాలిటీల నుంచి వేరుచేసేందుకు ఉద్దేశించిన బిల్లును ఆదివారం రాష్ట్ర శాసనసభ, శాసన మండలి ఆమోదం తెలిపాయి. బిల్లును ప్రవేశపెడుతూ మంత్రి కేటీఆర్, ఈ రెండు గ్రామాలను గ్రామపంచాయతీలుగా చేయనున్నట్టు తెలిపారు. అనంతరం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఈ రెండు వార్డులను రెండు గ్రామపంచాయతీలుగా చేసేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రవేశపెట్టగా ఉభయసభలు ఆమోదించాయి.
ద్యమ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి
తెలంగాణ ఉద్యమ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో పొందుపర్చాలని ఎమ్మెల్సీ తాతా మధు సూచించారు. ఉద్యమంలో తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం(టీడీఎఫ్) పాత్ర గొప్పదన్నారు. ఉద్యమం నుంచి అభివృద్ధి వరకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు అండగా ఉంటూ వస్తున్నారని పేర్కొన్నారు.
సీఎం సంకల్ప బలం గొప్పది
సీఎం కేసీఆర్ సంక ల్ప బలం చాలా గొప్పదని ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి ప్రశంసించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్తో తనకు సన్నిహిత సంబంధం ఉన్నదని గుర్తు చేసుకున్నారు. వ్యవస్థాపక సభ్యుడిగా, ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఉన్నదన్నారు. కేసీఆర్లో ఉన్న సంకల్ప బలమే తెలంగాణ సాధించేలా చేసిందని తెలిపారు.