హైదరాబాద్ : ఈ నెల 2వ తేదీన ఎస్సెస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. సైఫాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఫలితాల కోసం www.bse.telangana.gov.in అనే వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు. ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.