శ్రీశైలం : జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జునస్వామివారల ఆలయానికి ఆదాయం భారీగా సమకూరింది. ఉభయ దేవాలయాల హుండీలను మంగళవారం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన భద్రత, నిఘానేత్రాల మధ్య ఆలయ సిబ్బంది హుండీలను లెక్కించారు. గత 22 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మెక్కులు, కానుకలతోపాటు, హుండీలో వేసిన మెక్కులు నగదు రూపంలో రూ.3,85,45,858 ఆదాయం సమకూరిందని ఈవో లవన్న తెలిపారు. వీటితోపాటు 240 గ్రాముల బంగారం, 9 కేజీల 580 గ్రాముల వెండి ఆభరణాలు, విదేశీ కరెన్సీని స్వామి అమ్మవార్లకు మెక్కులుగా హుండీలో భక్తులు సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.