Srisailam Temple | శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జునస్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని గురువారం ఆలయ అధికారులు లెక్కించారు. అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్టమైన భద్రత మధ్య ఆలయ సిబ్బందితోపాటు శివసేవకులు ఉభయ దేవాలయాలు, పరివార దేవతల ఆలయాల హుండీలను లెక్కింపు చేపట్టారు. గత 34 రోజుల్లో స్వామి అమ్మవార్లకు నగదు రూపంలో రూ.5,07,46,508 ఆదాయంగా సమకూరిందని దేవస్థానం ఈవో లవన్న తెలిపారు.
అలాగే 324.5 మిల్లీ గ్రాముల బంగారం, పది కిలోలకుపైగా వెండి కానుకలను సమర్పించారన్నారు. వీటితో పాటు 839 అమెరికా డాలర్లు , 1115 యూఏఈ దిర్హమ్స్ , 130 యూరోలు, వంద ఆస్ట్రేలియా డాలర్లు, వంద మలేషియా రింగెట్స్, 85 ఇంగ్లండ్ పౌండ్స్, పది సింగపూర్ డాలర్ల విదేశీ కరెన్సీ నోట్లు కానుకలుగా సమర్పించారని ఈవో వివరించారు.