హైదరాబాద్: శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు(Srisailam Project)ను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకువచ్చే అంశంపై చర్చించేందుకు ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మను విద్యుత్ శాఖ ఏఈల సంఘం ప్రతినిధులు లేఖ రాశారు. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం, జల విద్యుత్ కేంద్రంలో పనిచేసే ఉద్యోగులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావొద్దని ఏఈల సంఘం కోరింది.
పవర్ ప్రాజెక్టుల్లో ఉన్న ఉద్యోగులు బోర్డు పరిధిలోకి వెళ్తే రెండు వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రాలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటాయని వారు వివరించారు.
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కేంద్రాలు పంపింగ్ మూడ్లో ఉండనందున అలాంటి ఇబ్బందులు అక్కడ ఎదురుకావని, కానీ తెలంగాణలో ఆ తరహా ఇబ్బందులు ఎదురవుతాయని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని విద్యుత్ శాఖ ఏఈల సంఘం కోరింది. ఈ విషయాన్ని తెలంగాణ విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ అనిల్ కుమార్ తెలిపారు.