Srisailam | శ్రీశైలం : శ్రీశైలం మహా క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్పవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా మేకలబండ గిరిజనులకు దేవస్థాన నిబంధనలపై శ్రీశైలం సీఐ ప్రసాదరావు అవగాహన కల్పించారు. బుధవారం క్షేత్ర పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఆయన మేకలబండ బస్తీలో నివసించే గిరిజనులతో మాట్లాడారు. నాటుసారా, మద్యం బాటిళ్లను తీసుకువచ్చి విక్రయాలకు పాల్పడటం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలతో పాటు మరోవైపు ఎన్నికలు వస్తున్నందున ఆలయ నిబంధనలు అతిక్రమించేందుకు ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ప్రసాదరావు హెచ్చరించారు.