రాజన్న సిరిసిల్ల : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో రేపటి నుంచి 21 వరకు శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 21వ తేదీన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. కరోనా వైరస్ దృష్ట్యా ఆలయంలోనే ఈ వేడుకలను నిర్వహించనున్నారు.