నిజామాబాద్ : మెండోర మండలంలోని శ్రీరాంసాగర్ ( Sriram Sagar ) ప్రాజెక్టు గేట్లు మరోసారి ఎత్తారు. గత మూడు రోజులుగా ఎగువ నుంచి వరద పెద్దఎత్తున వస్తుండటంతో ఎప్పటికప్పుడు నీటిని విడుదల చేసి దిగువకు పంపిస్తున్నారు. మంగళవారం తాజాగా 10 గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి వరద జలాలను పంపించారు. ప్రస్తుతం ఎగువ నుంచి 38 వేల క్యూసెక్కుల వరద పోటెత్తుతోంది.