హాజీపూర్, మే 24: తెలంగాణ ప్రగతిలో ఉద్యోగుల పాత్ర అమోఘమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్లో ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్వంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, పెద్దపెల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకానితో కలిసి శ్రీనివాస్గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సకల జనుల సమ్మెలో ఉద్యోగులంతా పాల్గొని రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా సీఎం పరిష్కరిస్తున్నారని తెలిపారు. చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పట్టణాలు, గ్రామాలు అన్ని రకాలుగా అబివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ఉద్యోగుల సహకారంతో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మాడల్గా నిలిచిందని తెలిపారు. జూన్ 2 నుంచి నిర్వహించే దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ ప్రవీణ్, టీఎస్టీటీసీఎఫ్సీఎల్ చైర్మన్ పల్లె రవికుమార్ పాల్గొన్నారు.