Srinivas Goud | హైదరాబాద్ : తనకు ప్రాణ హాని ఉందని, 44 భద్రత కల్పించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారించింది. అయితే శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థనను కోర్టు నిరాకరించింది. ప్రతి ఒక్కరికి ఈ విధంగా కేటాయించడం సాధ్యం కాదని కోర్టు తెలిపింది. గన్మెన్లు అవసరమో లేదో తెలపాలని డీజీపీని కోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్ తదుపరి విచారణను కోర్టు మార్చి 19వ తేదీకి వాయిదా వేసింది.