శామీర్పేట: జాతీయ స్థాయి ఖోఖో చాంపియన్షిప్ పోటీలకు రిఫరీగా సాయి శ్రీనివాస్యాదవ్ ఎంపికయ్యారు. ఈ నెల 20 నుంచి 24వ తేది వరకు మహారాష్ట్రలో జరుగనున్న జాతీయ స్థాయి 55వ సీనియర్ ఖోఖో టోర్నీలో శ్రీనివాస్ రిఫరీగా వ్యవహరిస్తారు. తెలంగాణ నుంచి మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామానికి చెందిన శ్రీనివాస్ రిఫరీగా ఎంపిక కావడంపై ఉపాధ్యాయులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.