హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): జైభీమ్ యూత్ ఇండియా తెలంగాణ అధ్యక్షుడిగా శ్రీనివాస్ ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో శనివారం కొత్త కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని వెల్లడించారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, రైతులకు 2 లక్షల రుణ మాఫీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీకి వెంటనే జాబ్క్యాలెండర్ విడుదల చేయాలని, లేదంటే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.