 
                                                            హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు మాజీ క్రికెటర్ అజారుద్దీన్కు (Azharuddin) కాంగ్రెస్ పార్టీ (Congress) మంత్రి పదవి కట్టబెడుతున్నది. ఎన్నికల సంఘం (EC) అడ్డుకోకపోతే.. మరో రెండు గంటల్లో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే అజార్కు మంత్రి పదవి ఆర్నెల్ల ముచ్చటేనా? అనే విషయమై సర్వత్రా చర్చ జరుగుతున్నది. మరోవైపు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై, అజర్కు మంత్రి పదవిపై తనకు సమాచారం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) చెప్పిన విషయం తెలిసిందే. ఏకంగా కేబినెట్ సీనియర్ మంత్రి, ముఖ్యమైన ఐటీ, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖలు చూస్తున్న దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) కూడా అజర్కు మంత్రి పదవి విషయం తెలియదట. అజారుద్దీన్ మంత్రి పదవి గురించి మీడియాలోనే చూశానని, తనకు సమాచారం లేదని ఓ మీడియా ప్రతినిధితో చెప్పారు. పాపం శ్రీధర్ బాబు, మహేశ్ గౌడ్.. ఎందుకంటే ఈ విషయం ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి (Asaduddin Owaisi) ముందే తెలుసు కాబట్టి. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థిని కూడా ఒవైసీ సూచించారట..!
రాష్ట్ర మంత్రివర్గంలో ఏం జరుగబోతున్నదో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్కు కనీస సమాచారం లేదని, ఆయన కంటే ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వద్దే స్పష్టమైన సమాచారం ఉన్నదని కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు. అజారుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారా? శుక్రవారం ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా?అని మీడియా ప్రతినిధులు బుధవారం మహేశ్కుమార్గౌడ్ను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ క్యాబినెట్ విస్తరణకు సంబంధించిగానీ, అజారుద్దీన్కు మంత్రి పదవి ఫైనల్ అయినట్టుగానీ తనకు సమాచారం లేదని పేర్కొన్నారు.
అజారుద్దీన్ మంత్రి పదవిపై టీవీల్లో వస్తున్న సమాచారమే తప్ప అధిష్ఠానం నుంచి ఎలాంటి సందేశం లేదని స్పష్టంచేశారు. పైగా శుక్రవారం క్యాబినెట్ విస్తరణ ఏర్పాట్లపై కూడా సమాచారం లేదని చెప్పడంతో కాంగ్రెస్ నేతలు ఆశ్చర్యపోయారు. ఇదే సమయంలో ఇదే ప్రశ్నను మీడియా ప్రతినిధులు ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీని అడుగగా.. కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ను మంత్రిగా నియమిస్తున్నదని, ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. దీంతో మహేశ్కుమార్గౌడ్కు చెప్పకుండా అధిష్టానం గోప్యంగా ఎందుకు ఉంచిందా? అని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ విషయంలో ప్రచారంలోకి రావటంతో గురువారం నిజామాబాద్లో మీడియా సమావేశంలో మహేశ్గౌడ్ మాటమార్చారు. అజారుద్దీన్ క్యాబినెట్లోకి రావటం ఖాయమని, బీజేపీ అడ్డుకోవాలని చూస్తున్నదని ఆరోపించారు.
తెలంగాణలో మరో 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుంది
మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి మంత్రులు బహిరంగంగా విమర్శలు చేసుకుంటారు
అజారుద్దీన్ మంత్రి పదవి గురించి మీడియాలోనే చూసాను.. నాకు సమాచారం లేదు – మంత్రి శ్రీధర్ బాబు
Video Credits – Tv9 pic.twitter.com/YOCteweN4U
— Telugu Scribe (@TeluguScribe) October 31, 2025
 
                            