పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పారిశుధ్య పనులు, మొక్కల నాటింపు
తిరుమలగిరి/నాగారం/తుంగతుర్తి/నూతనకల్/మద్దిరాల/అర్వపల్లి, జూలై 6 : నాలుగో విడుత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అన్ని గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపడుతున్నారు. రోడ్లపై గుంతలను మట్టితో పూడ్చుతున్నారు. ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేయడంతోపాటు వీధుల్లో మొక్కలు నాటుతున్నారు. తిరుమలగిరి మండలంలో మండల ప్రత్యేకాధికారి తిరుపతయ్య, ఎంపీడీఓ ఉమేశ్చారి, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. నాగారం మండలంలో ఎంపీపీ కూరం మణి, ఎంపీడీఓ శోభారాణి, వైస్ ఎంపీపీ గుంటకండ్ల మణిమాల, ఏపీఓ శేఖర్రావు, ఏఈ సతీశ్, పీఆర్ఏఈ శ్రీనివాస్, మండల ప్రత్యేకాధికారి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. తుంగతుర్తి మండలంలో మండల ప్రత్యేకాధికారి రామారావు, ఎంపీడీఓ లక్ష్మి, తాసీల్దార్ రాంప్రసాద్, డిప్యూటీ తాసీల్దార్ పుష్ప, ఎంపీపీ గుండగాని కవిత, ఎంపీటీసీ కేరెడ్డి లతారెడ్డి, సర్పంచులు నల్లు రామచంద్రారెడ్డి, విజయ్, అనిత, గుజ్జ పూలమ్మ, వీరోజీ, యాకూనాయక్, వెంకన్న నాయక్ పాల్గొన్నారు. నూతనకల్ మండలంలో ఎంపీపీ భూరెడ్డి కళావతి, జడ్పీటీసీ దామోదర్రెడ్డి, తాసీల్దార్ జమీరుద్దీన్, ఎంపీడీఓ ఇందిర పాల్గొన్నారు. మద్దిరాల మండలంలో మండల ప్రత్యేకాధికారి శ్రీధర్ పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. అర్వపల్లి మండలంలో పారిశుధ్య పనులు చేపట్టి పిచ్చిమొక్కలను తొలగించారు. ఎంపీపీ మన్నె రేణుక, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్, సర్పం చులు బైరబోయిన సునీత, శేఖర్, ఉషారాణి, రమావత్ వీరమ్మ, దానం సుజాత, వెంకటమ్మ పాల్గొన్నారు.
మార్కెట్లో ‘స్వచ్ఛ’ పనులు
సూర్యాపేట అర్బన్, జూలై 6 : పట్టణ ప్రగతిలో భాగంగా జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పారిశుధ్య పనులు చేస్తున్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి మరమ్మతులు చేపట్టారు. భవనాలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలతోపాటు పిచ్చి మొక్కలు తొలగించారు. కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి ఫసియొద్దీన్, మార్కెట్ సిబ్బంది ఖాశీం, సైదులు, నవీన్, ఉపేందర్, సంపత్, రమణ పాల్గొన్నారు.
ప్రకృతివనాల పరిశీలన
చివ్వెంల, జూలై 6 : మండల కేంద్రంతోపాటు వట్టిఖమ్మంపహాడ్, మొగ్గయ్య గూడెం, భద్యాతండా, ఎంజీనగర్ తండాల్లో ఎంపీడీఓ జమలారెడ్డి పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. రోడ్డు వెంట మొక్కలు నాటేందుకు గుంతలు తీయించకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ కలకొండ కరుణాశ్యాంసన్, పంచాయతీ కార్యదర్శి రశీద్ పాల్గొన్నారు.
ఇంటి ముందు మొక్కలు నాటాలి
బొడ్రాయిబజార్, జూలై 6 : ప్రజలు తమ ఇండ్ల ఎదుట మొక్కలు నాటి సంరక్షించుకోవాలని 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావనీకృపాకర్ అన్నారు. పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా వార్డు ప్రజలకు మొక్కలు పంపిణీ చేసి మాట్లాడారు. సోమ మురళి, కుక్కడపు భిక్షం, వార్డు అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ప్రగతి పనులు పరిశీలించిన డీపీఓ
తిరుమలగిరి, జూలై 6 : మండలంలోని చింతలకుంట, వెలిశాలలో మంగళవారం డీపీఓ యాదయ్య పల్లె ప్రగతి పనులు పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ ఉమేశ్చారి, ఎంపీఓ మారయ్య, సర్పంచులు జాటోతు రవీందర్, ఆకుల వీరయ్య, కార్యదర్శులు ఉన్నారు.
డంపింగ్ యార్డు మరోచోటుకు మార్చాలి తిరుమలగిరి మున్సిపాలిటీ నెల్లిబండతండా రోడ్డులో వైకుంఠధామం పక్కన ఉన్న డంపింగ్ యార్డు వల్ల దుర్వాసన వస్తున్నదని, దానిని మరో చోటుకు మార్చాలని అక్కడి రైతులు మంగళవారం స్థానిక తాసీల్దార్ సంతోష్కిరణ్కు వినతి పత్రం అందించారు.