ఇది మరో తరహా అవినీతి తంతు. ఎంతోకొంత నొక్కేయాలన్న గొంతెమ్మ కోరిక. దానికి సన్మానం అనే రంగుపూసి తనకు కాదన్నట్టు బిల్డప్. దీనికోసం ఓ నలుగురితో అనధికారిక బృందం ఏర్పాటు. ఆ నలుగురిలో ఓ ఇద్దరు మహిళలూ ఉండటం గమనార్హం. ఇంకేమి దశాబ్దాలుగా వృత్తిచేసినందుకు గాను వారికొచ్చిన కొద్దిపాటి సొమ్ములో కొంత తేరగా తిందామన్న అత్యాశకు బీజం పడింది. దీనికి వేదిక అయింది వ్యవసాయ యూనివర్సిటీ. ఆ అక్రమ వసూళ్లపర్వంపై విమర్శలు వెల్లువెత్తడంపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతున్నది.
హైదరాబాద్, జూలై 16(నమస్తే తెలంగా ణ): వ్యవసాయ యూనివర్సిటీలో అక్రమ వసూళ్ల పర్వానికి ఓ కీలక అధికారి తెరలేపినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజకీయ నే తలకు సన్మానం పేరుతో టార్గెట్ పెట్టి మరీ ప్రొ ఫెసర్ల నుంచి కమీషన్లు వసూలు చేస్తున్నట్టు ఆ రోపణలొచ్చాయి. యూజీసీ ఎరియర్స్ విడుదల కోసం 2శాతం చొప్పున కమీషన్లు ఇచ్చుకోవాలంటూ ఓ కీలక అధికారి ఈ అనధికారి క ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. దీని కోసం ఏకంగా ఓ కమిటీ వేసినట్టు చర్చ నడుస్తున్నది. ఆ నలుగురు ప్రొఫెసర్లతో ఏర్పాటుచేసిన ఈ కమిటీలో ఇద్దరు మహిళా ప్రొఫెసర్లు కూడా ఉండటం గమనార్హం. ఓ మహిళా ప్రొఫెసర్ జిల్లాల నుంచి వసూళ్ల బాధ్యతను తీసుకొన్నట్టుగా సమాచారం. కేవలం నగదు రూపంలోనే ఇవ్వాలని, ఆన్లైన్ పేమెంట్లకు అవకాశం లేదని తేల్చి చెప్తున్నట్టుగా తెలిసింది.
యూనివర్సిటీలోని ప్రొఫెసర్లకు, రిటైర్డ్ ప్రొఫెసర్లకు చాలా ఏండ్ల తర్వాత యూజీసీ ఎరియర్స్ కింద రూ.35 కోట్లను కేంద్రం ఇటీవల విడుదల చేసినట్టు తెలిసింది. వీటిలో రిటైర్డ్ ప్రొఫెసర్లకు కొంత మొత్తాన్ని పంపిణీ చేయగా, మిగిలిన వా రికి ఇచ్చేందుకు ఆడిట్ అభ్యంతరం చెప్పినట్టు తెలిసింది. ఈ సమస్య పరిష్కారం కాదేమోనని.. దీన్ని అడ్డుపెట్టుకొని ఇదే అదునుగా ఎక్కువ మొ త్తంలో వసూలు చేయాలని తొలుత ఆ కీలక అ ధికారి భావించినట్టు తెలిసింది. ప్రొఫెసర్లంతా క లిసి కలిసి చర్యలు తీసుకోవడంతో ఆ సమస్య పరిష్కారానికి మార్గం సుగుమం ఏర్పడింది. ఇందుకుగాను 2శాతం చొప్పున కమీషన్ వసూలు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
ఇటీవల విడుదలైన రూ.35 కోట్ల ఎరియర్స్పై వర్సిటీ కీలక అధికారి కన్నుపడినట్టు తెలిసింది. కారణం లేకుండా కమీషన్ వసూలు చేస్తే బద్నాం అవుతామని భావించి వసూలు కు సన్మానం ముసుగు తొడిగినట్టుగా సమాచా రం. ఎరియర్స్ కోసం చాలా ఏండ్లుగా పోరాడుతుండగా, ఎంపీలు చొరవ చూపారని తెలుస్తున్నది. ఇక్కడే ఆ కీలక అధికారి కుట్రతో ఆ సన్మానాన్ని తెరపైకి తెచ్చినట్టు తెలిసింది.
సదరు కీలక అధికారికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పోస్టు వచ్చింది. భవిష్యత్తులో తన రాజకీయ అవసరాల కోసం తన రూట్ మార్చినట్టు చర్చ జరుగుతున్నది. ఇప్పటివరకు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నట్టుగా నటిస్తూ వచ్చిన ఆ అధికారి.. ఇప్పుడు బీజేపీతో దోస్తీకి తహతహలాడుతున్నట్టుగా తెలిసింది. ఇందులో భాగంగానే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎంపీలను మచ్చిక చేసుకొనేందుకు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్టుగా వర్సిటీలో గుసగుసలు కోడై కూస్తున్నాయి.
ఎరియర్స్ విడుదలకు ఎంపీలైన ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, మల్లు రవి ఢిల్లీలో చొరవ చూపినట్టుగా చెప్తున్నారు. వారికి సన్మానం పేరుతో ఆ కీలక అధికారి తన రహస్య ఎజెండాను అమలు చేసి లక్షల సొమ్మును తన జేబులో వేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అసలు వాళ్లు సన్మానం చేయాలని అడిగారా? ఒకవేళ చేయాల్సి వస్తే ప్రొఫెసర్ల అసోసియేషన్కు ఆ బాధ్యతలు అప్పగించి కార్యక్రమం చేయిస్తే అందరి భాగస్వామ్యం ఉంటుందని, కానీ, సొమ్ములు నొక్కేందుకు కొందరినే ఎంపిక చేసుకొన్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ ప్రొఫెసర్ల సంఘాన్ని పక్కనబెట్టి అనధికారికి కమిటీ వేసి ఈ అడ్డదారి పనులెందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ కీలకాధికారి నిర్ణయంపై ప్రొఫెసర్ల సంఘం సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలిసింది. ఎంపీల సన్మానానికి ఇంత భారీ మొత్తం ఖర్చవుతుందా? అనే ప్రశ్నలు, అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.