హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) ఆధ్వర్యంలో నాంపల్లిలోని టీజీవో భవన్లో మహిళా ఉద్యోగులకు శనివారం వివిధ పోటీలు నిర్వహించారు. ఆ సంఘం అధ్యక్షురాలు వీ మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ విజేతలకు బహుమతులు అందజేశారు. మహిళా నేతలు వీ సుజాత, పీ సబిత, లావణ్య, జ్యోతి, శిరీష, స్వరూప, స్వర్ణలత, డాక్టర్ సునీతారెడ్డి, శ్రీలీల, డాక్టర్ యశోద పాల్గొన్నారు.
టీఎస్ఎస్పీడీసీఎల్లోనూ..
విద్యుత్తు మహిళా ఉద్యోగుల సం క్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం మింట్ కంపౌండ్లోని టీఎస్ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ ఉమెన్స్ డే వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో సీఎండీ జీ రఘుమారెడ్డి, సంస్థ డైరెక్టర్లు టీ శ్రీనివాస్, జీ పర్వతం, మదన్మోహన్రావు, స్వామిరెడ్డి, టీఎస్పీఈ జేఏసీ కన్వీనర్ రత్నాకర్రావు, జ్యోతిరాణి, జనరల్ జనరల్ సెక్రటరీ తులసి నాగరాణి పాల్గొన్నారు.