హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్పోర్ట్స్ కల్చరల్ మీట్-2026 శనివారం ఎల్బీ స్టేడియంలో ప్రారంభమైంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్లతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ పోటీలను ప్రారంభించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో అర్ధాంతరంగా క్రీడాపోటీలు నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు స్పోర్ట్స్ కల్చరల్ మీట్ను బహిష్కరించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు.