బీబీనగర్, జనవరి 3: సమాజంలో ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారానే ప్రశాంతత ఏర్పడుతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. మం గళవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మహదేవ్పూర్లోని బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నిర్మించిన నేటివ్స్ రిట్రీట్ సెంటర్ను రాష్ట్రపతి మౌంట్ అబూ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. రాజస్థాన్లోని బ్రహ్మకుమారీస్ అంతర్జాతీయ ముఖ్యకేంద్రం శాంతివనం కాంప్లెక్స్లో నిర్వహించిన వేడుకలో రాష్ట్రపతి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముర్ము మా ట్లాడుతూ.. ప్రజల జీవితాల్లో ప్రశాంతతను పెంపొందించేందుకు బ్రహ్మకుమారీస్ అందిస్తున్న ఆధ్యాత్మిక సేవలు అభినందనీయమని కొనియాడారు. గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్.. రిట్రీట్ సెంటర్ ప్రాంగణంలో నిర్మించిన తపస్యాధామం, భాగ్యవిధాత భవన్, స్పిరిచ్యువల్ ఆర్ట్ గ్యాలరీను సందర్శించారు. ఆశ్రమ సేవల గురించి సెంటర్ డైరెక్టర్లు జీకే రాజాజ్, బీకే సునీత గవర్నర్కు వివరించారు.