హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆత్మీయ సమ్మేళనాలు నయా జోష్ తెస్తున్నాయి. నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధుల ఆత్మీయ ఆలింగనాలతో సమావేశాలు ప్రత్యేకతను సంతరించుకుంటున్నా యి. శనివారం రాష్ట్రంలోని 14 నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు చాకూర మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, వీ శ్రీనివాస్గౌడ్, శాసనమండలిలో ప్రభుత్వ విప్ శంభీపూర్ రాజు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సహా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.\
ఖమ్మం నియోజకర్గంలోని రఘునాథపాలెంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ పాల్గొని గ్రామాల వారీగా అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ‘ప్రగతి నివేదిక’ సిద్ధం చేసి ఇంటింటికీ పంపిణీ చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. అనంతరం సహపంక్తి భోజనం చేశారు.
నిర్మల్ నియోజకర్గంలోని సోన్ మండల కేంద్రం లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్వయంగా పార్టీ శ్రేణులకు భోజనాలు వడ్డించారు. బీఆర్ఎస్ సీనియర్ నేత పాకాల రాంచందర్ అంబలిని తయారు చేసి అందించారు.
మక్తల్, గద్వాల నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేలు అబ్రహాం, చిట్టెం రాంమ్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో నేతలు, పార్టీ శ్రేణులంతా ఒకే కు టుంబంలా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో జెడ్పీ చైర్పర్సన్లు సరిత, వనజ, ఎమ్మెల్యే చిట్టెం సతీమణి సుచరిత పాల్గొన్నారు.
ఇల్లు గడవటం కష్టమైతాంది. ఆదుకోండి. అని ఆత్మీయ సమావేశానికి వచ్చిన మహిళా కార్యకర్త మహబూబ్నగర్లో జరిగిన సమ్మేళనంలో అనగానే మంత్రి శ్రీనివాస్గౌడ్ చలించిపోయారు. ఆమె కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇ చ్చారు. ఆమె పిల్లలను చదివిస్తానని, ఇల్లు నిర్మించుకోవడానికి రూ.3 లక్షలు ఇప్పిస్తానని, కొత్త ఇంటికి వచ్చి చాయ్ తాగుతా అని హామీ ఇచ్చారు.
తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. టీఎస్పీఎస్సీలో అర్హులకే ఉద్యోగాలు వచ్చాయని ఆర్ ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లా ఆత్మీయ సమ్మేళనంలో వారితో పాటు విప్ శంభీపూర్ రాజు పాల్గొన్నారు.
పార్టీ కార్యకర్తలను, నాయకులను, ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునే సీఎం కేసీఆర్ ఉండటం అందరికీ అదృష్టం అని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సనత్నగర్ నియోజకవర్గంలోని బేగంపేట డివిజన్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. సమావేశంలో హైదరాబాద్ జిల్లా పార్టీ ఇన్చార్జి దాసోజు శ్రవణ్, సికింద్రాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ సాయికిరణ్యాదవ్, బీఆర్ఎస్ నేతలు కట్టెల శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నకిరేకల్, నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో జరిగిన సమ్మేళనాలు బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. నార్కట్పల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ర్యాలీగా తరలివచ్చారు. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, ఎన్ భాస్కర్రావు, రవీంద్రకుమార్, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి పాల్గొన్నారు.