హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ ) : పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం మంత్రులు సీతక, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డితో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరంగల్ స్మార్ట్ సిటీ పనులు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, తాగునీరు, ఇందిరమ్మ ఇండ్లు తదితర అంశాలపై చర్చించారు. బేస్మెంట్ పూర్తయిన ఇండ్లకు తక్షణం చెల్లించాలని ఆదేశించారు.