హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2026 నిర్వహణలో భాగంగా ప్రజాభవన్లో ప్రత్యేక వార్రూమ్ను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రజాభవన్లో జరిగిన మంత్రి వర్గ ఉపసంఘం సమావేశంలో భట్టి మాట్లాడుతూ గతంలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల ప్రస్తుత పురోగతిపై సమగ్ర విశ్లేషణ చేసేందుకు ప్రత్యేక కమిటీకి బాధ్యతలు అప్పగించాలని సూచించారు. సమావేశంలో మంత్రులు ఉత్తమ్, శ్రీధర్బాబు, ప్రభుత్ర ప్రధాన కార్యదర్శి సంజయ్జాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.