హైదరాబాద్ : దీపావళి, ఛత్ పూజ పండుగల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ప్రయాణికుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్ ( Secundrabad )-రాక్సోల్- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల మధ్యలో ప్రత్యేక జనసాధారణ (Jansadaran) ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటించారు.
జన సాధారణ ప్రత్యేక రైళ్లలో 22 అన్ రిజర్వ్డ్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉన్నాయన్నారు. దాదాపు 2400 మందికి సీటింగ్(Seating) సామర్థ్యం కలిగి ఉంటాయన్నారు. ఇతర ప్రయాణ సాధనాలతో పోలిస్తే ఛార్జీలు చాలా తక్కువగా ఉందని వెల్లడించారు. నాలుగు ప్రత్యేక రైళ్లు ఈ నెల 12, 14, 19, 21 తేదీలలో రాకపోకలు కొనసాగిస్తాయని పేర్కొన్నారు.