హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కాచిగూడ నుంచి కాకినాడకు దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైలు నడుపుతున్నది. శుక్రవారం రాత్రి 9 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. నల్లగొండ, విజయవాడ, భీమవరం, రాజమహేంద్రవరం మీదుగా కాకినాడకు చేరుతుందని వెల్లడించారు. ప్రత్యేక రైలులో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించామని, ప్రయాణికులు దీనిని ఉపయోగించుకోవాలని తెలిపారు. కాగా, ప్లాట్ఫామ్ టికెట్ ధరను రూ.10కి తగ్గించారు. కరోనా సమయంలో రైల్వే స్టేషన్లలో రద్దీని నిలువరించడానికి గతంలో ప్లాట్ఫామ్ ధరలను రైల్వే శాఖ పెంచిన విషయం తెలిసిందే.