హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 18న సికింద్రాబాద్ – తిరుపతి మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ స్టేషన్లో 18న సాయంత్రం 6:10 గంటలకు ప్రత్యేక రైలు(07588) బయల్దేరనుంది. మరుసటి రోజు ఉదయం 7:10 గంటలకు తిరుపతి చేరుకోనుంది.
సికింద్రాబాద్ – తిరుపతి వెళ్లే ప్రత్యేక రైలు బేగంపేట్, లింగంపల్లి, శంకర్పల్లి, వికారాబాద్, చిట్టాపూర్, రాయిచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట్, కోడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగనుంది. ఈ ప్రత్యేక రైలులో ఏసీ II టైర్, ఏసీ III టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు అందుబాటులో ఉండనున్నాయి.