హైదరాబాద్ : కాచిగూడ నుంచి కాకినాడకు శుక్రవారం ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే గురువారం తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైలును నడిపిస్తున్నట్లు పేర్కొన్నది. శుక్రవారం రాత్రి 9 గంటలకు కాచిగూడ స్టేషన్ నుంచి బయలుదేరుతుందని చెప్పింది. నల్గొండ, విజయవాడ, భీమవరం, రాజమహేంద్రవరం మీదుగా కాకినాడకు చేరుకుంటుందని తెలిపిన దక్షిణ మధ్య రైల్వే.. రైలులో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉందని వివరించింది. విషయాన్ని ప్రయాణికులు గమనించి, ప్రత్యేక రైలు సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది.