నాగార్జునసాగర్, జూన్ 26 : రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నాగార్జునసాగర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టులో ధమ్మ నాగార్జున అంతర్జాతీయ విపస్యన ధ్యాన కేంద్రం సహకారంతో నిర్వహిస్తున్న ధ్యాన శిక్షణ తరగతులకు విశేష స్పందన లభిస్తుందని బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు .
ఆదివారం బుద్ధవనంలో ఓఎస్డీ మధుసూదన్ రెడ్డి, బుద్ధవనం కన్సల్టెంట్ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పర్యవేక్షణలో నిర్వహించిన ధ్యాన శిక్షణ తరగతులకు సుమారు 100 మంది హాజరైనట్లు గా తెలిపారు.
హైదరాబాద్, నల్గొండ , మిర్యాలగూడ, నాగార్జునసాగర్, హాలియా పరిసర ప్రాంతాల నుంచి బుద్ధ వనంలో నిర్వహించే ధ్యాన శిక్షణ తరగతులకు హాజరు అయ్యారని తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాక ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు హాజరుకావాలని తెలిపారు.