మంచిర్యాల : జిల్లా కేంద్రంలోని ఎఫ్సీఏ ఫంక్షన్ హాల్లో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచార సభ సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం నెల్లూరు ఆనందయ్య ఆయుర్వేద మందును పంపిణీ చేయగా విశేష స్పందన వచ్చింది. మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందర్ రెడ్డి ఏబీఏపీ సభ్యులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణలో మొట్టమొదటి సారిగా మంచిర్యాల జిల్లాలో ప్రారంభించడం చాల సంతోషంగా ఉందని, సుమారు 30 వేల మందికి పైగా ఉచితంగా మందు అందజేశామని అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచార సభ రాష్ట్ర అధ్యక్షుడు రాచర్ల రమేశ్ తెలిపారు.
అనంతరం మందును ఎలా వాడాలని ఆనందయ్య సోదరుడి కుమారుడు ప్రణవ్ సూచనలు చేశారు. ఆనందయ్య మందు కోసం జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే బారులు తీరారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పట్టణ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి..
రేపటి నుంచి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
దళిత బంధు చరిత్రలో నిలిచిపోతుంది : ఎల్. రమణ
చరిత్రలో ఈరోజు.. 14 బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ
అక్రమంగా పట్టా చేసుకున్నాడని.. పంట పొలంలోనే కట్టేశారు
ఇల్లందకుంటలో దళితుల భారీ ర్యాలీ