Telangana | హైదరాబాద్ : ఈ నెల 27వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సెలవు ప్రకటించింది. వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ స్థానానికి, మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ ఉపాధ్యాయ స్థానానికి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నియోజకవర్గాల పరిధిలో పని చేసే టీచర్లకు ప్రభుత్వం ప్రత్యేక సెలవు ప్రకటించింది.
మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి కూడా అదే రోజు ఎన్నికలు నిర్వహించనున్నారు. పట్టభద్రుల ఓటర్ల విషయంలోనూ సీఈవో కీలక సూచనలు చేసింది. ప్రయివేటు సంస్థలు తమ ఉద్యోగులు ఓటు వేసేలా సహకరించాలని సీఈవో కోరారు. షిప్టుల సర్దుబాటు, ఓటు వేసేందుకు సమయం ఇవ్వాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | అందరికీ రుణమాఫీ.. అదో అందమైన కట్టుకథ : హరీశ్రావు