యాదాద్రి, డిసెంబర్ 31 : నూతన సంవత్సరం సందర్భంగా స్వయంభూ నారసింహుడి దర్శనానికి ఆదివారం ఉదయం 6.30 నుంచే అనుమతిస్తున్నట్టు ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. జనవరి ఒకటి నూతన సంవత్సరం దృష్ట్యా ఆలయ శుద్ధి చేపట్టి కొబ్బరి మట్టలు, అరటి ఆకులు, పూలతో ద్వారాలను ముస్తాబు చేశారు. స్వామివారి ప్రసాదాన్ని కావాల్సినంత అందుబాటులో ఉంచనున్నట్టు ఆమె పేర్కొన్నారు. వంద గ్రాముల లడ్డూలు, అభిషేకం లడ్డూలను లక్ష వరకు అందుబాటు లో ఉంచినట్టు చెప్పారు. పులిహోర ఎక్కువ మొత్తంలో తయారు చేసి సిద్ధంగా ఉంచినట్టు ఆమె తెలిపారు. స్వామివారి ప్రసాద విక్రయ కౌంటర్లను ఉదయం 5 నుంచి రాత్రి 10 వరకు తెరిచి ఉంచుతామని అన్నారు. కొండపైన ఆలయ పరిసరాలు, క్యూ కాంప్లెక్స్ ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేసి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు.
నేటి పూజలు ఇలా..
2 ఉ.3 నుంచి 3:30 వరకు సుప్రభాతం
2 ఉ.3:30 నుంచి 4 వరకు తిరువారాధన
2 ఉ.4 నుంచి 5 వరకు బాలభోగం,
2 ఉ. 5 నుంచి 6 వరకు నిజాభిషేకం
2 ఉ. 9 నుంచి 10 వరకు బ్రేక్ దర్శనాలు
2ఉ.10నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉభయ దర్శనాలు
2 మ.12 నుంచి ఒంటి గంట వరకు మధ్యాహ్న రాజభోగం
2 మ.ఒంటి గంట నుంచి సాయంత్రం 4 వరకు ఉభయ దర్శనాలు
2 సా. 4 నుంచి 5 వరకు బ్రేక్ దర్శనాలు
2 సా.5 నుంచి రాత్రి 7 వరకు
ఉభయ దర్శనాలు
2 రాత్రి 7:30 నుంచి 8:15 వరకు
సహస్రనామార్చనలు
2 రాత్రి 9నుంచి 9:45వరకు రాత్రి నివేదన