Gruha Jyothi | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): అన్ని అర్హతలు ఉండీ గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లు రానివారికోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని, పథకంలో లబ్ధి పొందేందుకు అర్హులైనా కూడా యూనిక్ సర్వీస్ (యూఎస్సీ) నెంబర్, ఆహారభద్రత వివరాలు తప్పుగా నమోదు వంటి కారణాల వల్ల అనేక మంది జీరో బిల్లుకు దూరమయ్యారు. ఇలాంటి వారు తమ వివరాలు సరి చేసుకునేందుకు మండల పరిషత్తు, మున్సిపల్, జీహెచ్ఎంసీ సరిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం పేర్కొన్నది. ఇది ఒక నిరంతర ప్రక్రియ అని తెలిపింది.