నాడు.. ఎక్కడ చూసినా నీటి కరువు.. ఎండిన చెరువులు..పారని కాలువలు.. అడుగంటిన భూగర్భ జలాలు..చివరి ఆయకట్టుకు నీరందక రైతన్న కష్టాలపాలు.. నేడు.. సీఎం కేసీఆర్ దూరదృష్టితో తెలంగాణ ఓ నీళ్లకుండ అయ్యింది. ప్రతి నీటిబొట్టునూ సమర్థవంతంగా వినియోగం చేసుకొనేందుకు బహుముఖ వ్యూహాలను అమలు చేస్తూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. అధునాతన టెక్నాలజీతో భారీ ప్రాజెక్టులనుంచి నీటి వృథాను అరికడుతూ రాష్ట్రంలో వేసవిలోనూ జలసవ్వడులు వినిపిస్తున్నది. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా తెలంగాణ నీటి పొదుపు మంత్రంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
Mdk Pocharam Project
హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ సాగునీటి రంగంలో నవశకం ఆరంభమైంది. దేశవ్యాప్తంగా అత్యధికంగా సాగునీటి వసతి కలిగిన రాష్ర్టాల టాప్ టెన్ జాబితాలో ఒకటి గా నిలువడమే ఇందుకు నిదర్శనం. మరోవైపు లక్షల కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న ప్రాజెక్టులను అంతే సమర్థంగా వినియోగించుకొనే అంశాలపైనా ప్రత్యేక దృష్టిపెట్టింది. తొలుత వారబందీ విధానానికి, ఆ తర్వాత టెయిల్ టు హెడ్ (చివరి నుంచి మొదలు) విధానానికి శ్రీకారం చుట్టింది.
డెసిషన్ సపోర్ట్ సిస్టంపై (డీఎస్ఎస్) సాఫ్ట్వేర్ను, మొబైల్ యాప్లను రూపొందిం చి రిజర్వాయర్లు, పంప్హౌస్లు, కాలువల్లో నీటిప్రవాహాలు, ఇన్ఫ్లోలు, ఔట్ ఫ్లోలకు సంబంధించి రియల్టైమ్ డాటా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ డీఎస్ఎస్ విధానాన్ని రాష్ట్రంలోని అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకు విస్తరిస్తున్నది. మరమ్మతులు, నిర్వహణ లోపాలను ఎప్పటికప్పుడు నివారించేందుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కొత్తగా ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) విభాగాన్ని నెలకొల్పారు. ఫలితంగా నీటి వృథాకు, పంపిణీలో అంతరాయానికి తెరపడింది. నీటివృథాను అరికట్టేందుకు తాజాగా మరో రెండు వినూత్న ప్రయోగాలకు తెలంగాణ శ్రీకారం చుట్టడం విశేషం.
Oora Chervu
కెనాల్ ఆటోమేషన్ సిస్టం
సాగునీటి సరఫరాకు క్షేత్రస్థాయిలో ఎదుర య్యే అనేక సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నది. నీటి వృథా లేకుండా ఆటోమేటిక్గా చివరి ఆయకట్టు వరకూ నీరందించేందుకు ‘కాళేశ్వరం’లో భాగంగా నిర్మించిన రంగనాయకసాగర్లో కెనాల్ ఆటోమేషన్ సిస్టం అమలుకు శ్రీకారంచుట్టింది. ఎడమ ప్రధాన కాలువపై మొదటి 3 కుడి డిస్ట్రిబ్యూటరీలను ఇందుకు ఎంపిక చేసింది. 23 ఆటోమేటిక్ గేట్లతో15 వేల ఎకరాలకు ప్రయోగాత్మకంగా నీటిని విడుదల చేస్తూ పరీక్షిస్తున్నది.
ప్రెషర్ పైప్డ్ ఇరిగేషన్ సిస్టం
కాలువల ద్వారా నీటి వృథాను అరిక ట్టేందుకు యూఎస్ఏ, ఆస్ట్రేలియా తరహాలోనే ప్రెషర్ పైప్లైన్ ఇరిగేషన్ సిస్టం అమలుకు శ్రీకారంచుట్టింది. ‘కాళేశ్వరం’లో భాగంగా చేపట్టిన 21వ ప్యాకేజీలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.
సీఎం మార్గనిర్దేశనంలో వినూత్న సాగునీటి యాజమాన్య పద్ధతులకు శ్రీకారం చుడుతున్నాం. ఈ యాసంగి నుంచి కెనాల్ ఆటోమేషన్ ప్రారంభించాం. నీటి వృథాను నివారించగలిగాం. అధికారులు, సిబ్బంది, రైతులనుంచి కూడా ఈ విధానంపై విశేష స్పందన లభిస్తున్నది.
-హరిరాం, గజ్వేల్ ఈఎన్సీ
P
ప్రయోజనాలు..
ఈ సిస్టం ప్రయోజనాలు