కోటగిరి, అక్టోబర్ 26: ఎన్నికల్లో బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికే ఓటు వేస్తామని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం మిర్జాపూర్ క్యాంప్నకు చెందిన కమ్మ కులస్థులు ప్రకటించారు. బీఆర్ఎస్కు, స్పీకర్కు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటిస్తూ కమ్మ సంఘానికి చెందిన వంద కుటుంబాల వారు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
గురువారం కోటగిరిలో జరిగిన చేరికల కార్యక్రమంలో కమ్మ కులస్థులు తీర్మాన ప్రతులను డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డికి అందజేశారు.