హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘం, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కర్ణాటకలోని బెంగళూరు సిటీ యూనివర్సిటీలో శుక్రవారం నిర్వహించిన ఓబీసీ జాతీయ 11వ మహాసభ విజయవంతంగా కొనసాగింది.
దేశం నలువైపులా నుంచి వేలాదిమంది ఓబీసీ ప్రతినిధులు పాల్గొనగా, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కర్ణాటక పీసీసీ చీఫ్ బీకే హరిప్రసాద్, తెలంగాణ నుంచి ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు, ఈటల రాజేందర్, బీఆర్ఎస్ పార్టీ శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, మహారాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి అదుల్ సావే, కర్ణాటక డిప్యూటీ స్పీకర్ ఉమాశ్రీ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, ఏపీ అధ్యక్షుడు కేసన శంకర్రావు, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.