హైదరాబాద్ : భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందరివాడు, ఆ మహానీయుడిని ఒక కులానికి అంటగట్టడం సరికాదని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. రాజ్యాంగం రూపొందించేందుకు అంబేద్కర్ విశేష కృషి చేశారని కొనియాడారు. పేదరికాన్ని నిర్మూలించినప్పుడే నిజమైన అభివృద్ధి జరిగినట్టు అని తెలిపారు. మాటలతో కాకుండా చేతలతో చూపిస్తేనే పేదరికం పోతుందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ అభివృద్ధి దిశలో పయనిస్తోందన్నారు. ఈ దేశం సీఎం కేసీఆర్ను కోరుకుంటోందని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి లాంటి వారే చెప్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాల అమల్లో దేశానికే తెలంగాణ రోల్మోడల్గా నిలిచిందని స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
భారతరత్న, రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు 🙏#DrBRAmbedkar #AmbedkarJayanti pic.twitter.com/EsVu6A0ZSX
— Pocharam Srinivas Reddy (@PSRTRS) April 14, 2022