హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): కంటి వెలుగు కార్యక్రమం దేశంలోనే గొప్పదని, ఇది పేదలకు ఎంతో ఉపయోగకరమని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అ న్నారు. ఇతర రాష్ర్టాలు సైతం కంటి వెలుగును ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. బుధవారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ సిబ్బంది, మీడియా ప్రతినిధుల కోసం అసెంబ్లీలో కంటి వెలుగు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటుచేశారు. శిబిరాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రారంభించారు. గతంలో మెరుగైన, ఆధునిక వైద్యం కోసం దూరప్రాంతాలకు వెళ్లలేక కండ్లు పోగొట్టుకున్న పేదలు లక్షల్లో ఉన్నారని పోచా రం ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మం త్రులు వేముల ప్రశాంత్రెడ్డి, హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, శాసనసభ కార్యదర్శి డాక్ట ర్ వీ నరసింహాచార్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు అధికారులు పాల్గొన్నారు.
కంటి వెలుగు అద్భుతం: ఎంఐఎం ఎమ్మెల్యేలు
కంటి వెలుగు కార్యక్రమం అద్భుతంగా ఉన్నదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్, పాషాఖాద్రి, ముంతాజ్ఖాన్ ప్రశంసించారు.