కామారెడ్డి : జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలంలో గల పోచారం ప్రాజెక్టు నుంచి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయన్నారు.
ప్రాజెక్టుల అనుసంధానంతో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్దది, అద్భుతమైందని ప్రశంసించారు. సీఎం కేసీఆర్ పాలనలో రైతులకు మంచి చేసే నిర్ణయాలు జరుగుతున్నాయని తెలిపారు.
భారీ వర్షాలతో గ్రామాల చెరువుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు చెరువులను ఎప్పటి కప్పుడు పరిశీలిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.