కామారెడ్డి : జిల్లాలోని మద్నూరు మండలం మేనూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో-లారీ ఢీకొన్న సంఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటనపై శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం ప్రకటించారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.