హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ బుధవారం విచారించనున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినవెంటనే పార్టీ ఫిరాయించారు. 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ బీ ఫాంపై సికింద్రాబాద్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. దానం పార్టీ ఫిరాయించారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పీకర్కు రెండేండ్ల క్రితమే ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై స్పీకర్ స్పందించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం ఆదేశాలతో స్పీకర్ పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై విచారణ చేపట్టారు.పది మంది ఎమెల్యేలపై ఫిరాయింపు ఆరోపణలు రాగా.. 8 మందిపై విచారణను ఇప్పటికే ముగించారు. ఇప్పుడు నాగేందర్, ఎమ్మెల్యే శ్రీహరి ఫిరాయింపు అంశంపై విచారణ జరుపాల్సి ఉన్నది. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డికి సమాచారం ఇచ్చారు.