హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): సదరన్ జోనల్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ 13వ సమావేశం శుక్రవారం చెన్నైలో జరుగనున్నది.సమావేశంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ అధికారులు పాల్గొనున్నారు.
ముఖ్యంగా, ఖమ్మంలో స్టీల్ ఫ్యాక్ట రీ, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల ఉ త్పత్తి కేంద్రం, సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాల పంపిణీకి ట్రిబ్యునల్ , కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, కర్ణాటక అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టులపై చర్చించాలని తెలంగాణ ప్రతిపాదించింది.