హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల నిర్మిస్తున్న రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్)లో చౌటుప్పల్-ఆమన్గల్-షాద్నగర్-సంగారెడ్డి మధ్య 182 కి.మీ. పొడవైన దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. కేంద్రం ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించింది. సీఎం రేవంత్రెడ్డి మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం తర్వాత దక్షిణ భాగాన్ని కూడా జాతీయ రహదారిగా ప్రకటించేందుకు అంగీకరించారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను పంపాలని ఎన్హెచ్ఏఐ అధికారుల ను ఆదేశించారు. తెలంగాణలోని జాతీయ రహ దారుల విస్తరణకు అనుమతి ఇవ్వాలని, రాష్ట్రంలోని పలు ముఖ్యమైన రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని సీఎం రేవంత్ ఈ భేటీలో గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారులుగా విస్త రించాల్సిన రాష్ట్ర రహదారుల జాబితాను అందజేశారు. సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి, ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితోపాటు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.
అధికారులపై గడ్కరీ ఆగ్రహం
ఈ భేటీలో తొలుత రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగంలోని చౌటుప్పల్-భువనగిరి-తూప్రాన్-సంగారెడ్డి-కంది పరిధిలో యుటిలిటీస్ (కరెంటు స్తంభాలు, భవనాల) తొలగింపునకు సంబంధించిన వ్యయం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనపై చర్చ జరిగింది. యుటిలిటిస్ తరలింపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఎన్హెచ్ఏఐ అధికారులు గతంలో చేసిన సూచనకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. కానీ, సీఎంగా రేవంత్ బాధ్యతలు స్వీకరించాక యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని భరించేందుకు అంగీకరిస్తూ ఎన్హెచ్ఏఐకి లేఖ పంపారు. ప్రస్తుత భేటీలో రేవంత్ ఈ అంశాన్ని ప్రస్తావించడంతో ఆ అంశంపై గడ్కరీ ఎన్హెచ్ఏఐ అధికారులను ఆరా తీశారు. యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని మెలిక పెట్టింది ఎరంటూ ఆ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వేళ రాష్ట్ర ప్ర భుత్వం యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని భరిస్తే భవిష్యత్తులో టోల్ వసూళ్ల ద్వారా వచ్చే ఆదాయంలో సగం భాగాన్ని రాష్ర్టానికి చెల్లించాల్సి ఉంటుందని గడ్కరీ పేర్కొంటూ.. యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని హామీ ఇచ్చారు.ఆర్ఆర్ఆర్కు భూసేకరణతోపాటు ఇతర విధానపరమైన ప్రక్రియలను వేగవంతం చేయాలని రేవంత్కు గడ్కరీ సూచించారు.
అప్గ్రేడ్ చేయాలని సీఎం కోరిన రోడ్లు