Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులు గుడ్న్యూస్ చెప్పింది. కాజీపేట, మంచిర్యాల, బెల్లంపల్లి మీదుగా చర్లపల్లి మీదుగా పట్నాకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది జనవరి 2వ తేదీ వరకు రాకపోకలు సాగిస్తాయని పేర్కొంది. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను తీసుకువచ్చినట్లు చెప్పింది. పట్నా-చర్లపల్లి (03253)రైలు అక్టోబర్ ఒటి నుంచి డిసెంబర్ 31 వరకు ప్రతి సోమ, బుధవారాల్లో రాకపోకలు సాగిస్తుందని పేర్కొంది.
చర్లపల్లి-పట్నా (07255) రైలు అక్టోబర్ 3వ తేదీ నుంచి 2026 జనవరి 2వ తేదీ వరకు ప్రతి బుధవారం నడుస్తుందని.. చర్లపల్లి-పట్నా (07256) రైలు అక్టోబర్ 3 నుంచి వచ్చే ఏడాది జనవరి 2 వరకు ప్రతి శుక్రవారం నడుస్తుందని తెలిపింది. ఆయా ప్రత్యేక రైళ్లు కాజీపేట, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్నగర్, బల్లార్షా, నాగ్పూర్, గోందియా, దుర్గ్, రాయ్పూర్, బిలాస్పూర్, ఝార్సుగూడ, రూర్కెలా, హతియా, రాంచి, బొకారో స్టీల్ సిటీ, గోమోహ్, కొడెర్మా, గయా, జెహనాబాద్ స్టేషన్లలో రైళ్లు ఆగుతాయని వివరించింది. రైలులో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచెస్ అందుబాటులో ఉన్నాయని రైల్వేశాఖ తెలిపింది.