SCR | వికారాబాద్ వాసులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. నాలుగు రైళ్లను తాతాల్కికంగా నిలుపలున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ముంబయి సీఎస్టీఎం-భువనేశ్వర్ (11019) రైలు ఉదయం 2.9గంటలకు వచ్చి.. 2.10గంటలకు బయలుదేరనున్నాయి. ఈ రైలు ఈ నెల 30, 31న, ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో ఆగుతుందని చెప్పింది. రాజ్కోట్-సికింద్రాబాద్ (22717) రైలు ఉదయం 5.9 గంటలకు బయలుదేరి.. 5.10 గంటలకు బయలుదేరి వెళ్తుంది.
ఈ రైలు ఈ నెల 30, 31న, ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో ఆగుతుందని వివరించింది. భువనేశ్వర్-సీఎస్టీఎం (11020) రైలు మధ్యాహ్నం 12.14 గంటలకు వచ్చి.. మళ్లీ 12.15 గంటలకు బయలేరి వెళ్తుంది. ఈ రైలు ఫిబ్రవరి 2, 3, 14, 15 తేదీల్లో ఆగబోతున్నది. సికింద్రాబాద్ – రాజ్కోట్ (22718) రైలు మధ్యాహ్నం 3.59 గంటలకు చేరుకొని.. 4 గంటలకు బయలుదేరి వెళ్తుందని, 3, 4, 15, 16 తేదీల్లో తాత్కాలికంగా వికారాబాద్ స్టేషన్లో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే పీఆర్వో రాకేశ్ వివరించారు.