హైదరాబాద్: రెండు రోజుల క్రితం హైదరాబాద్ సమీపంలో గోదావరి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమయింది. రైల్వే ట్రాక్ల మరమ్మత్తులు, మెయింటేనెన్స్ పనులు చేపట్టింది. ఈనేపథ్యంలో శుక్ర, శనివారాల్లో పలు మార్గాల్లో రైళ్లను పాక్షికంగా రద్దుచేసింది. వాటిలో మెదక్-కాచిగూడ, నాందేడ్-ఆదిలాబాద్, మహబూబ్నగర్-కాచిగూడ, వరంగల్-కాచిగూడ, సికింద్రాబాద్-వరంగల్, చిత్తాపూర్-సికింద్రాబాద్ మధ్య నడిచే రైళ్లు ఉన్నాయి.
కాచిగూడ- మెదక్ (07850) మధ్య నడిచే రైలు నేడు, రేపు రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా మెదక్ నుంచి కాచిగూడ (07588) మధ్య నడిచే రైలును ఫిబ్రవరి 17 నుంచి ఈనెల 19 వరకు రద్దు చేశారు. చిత్తూర్-సికింద్రాబాద్, రాయ్చూర్-గుంతకల్ మధ్య నడిచే రైళ్లు 17, 18 తేదీల్లో నడవవని చెప్పారు.
వీటితోపాటు శుక్రవారం నడవాల్సిన ఆదిలాబాద్-నాందేడ్ (17409), నాదేండ్-ఆదిలాబాద్ (1740), కాచీగూడ-కర్నూల్ సిటీ, కర్నూల్ సిటీ-కాచిగూడ, చిత్తాపూర్-సికింద్రాబాద్-చిత్తాపూర్, సికింద్రాబాద్-వరంగల్, వరంగల్-హైదరాబాద్, కాజిపేట్-వరంగల్, డోర్నకల్-విజయవాడ-డోర్నకల్, డోర్నకల్-కాజీపేట్, విజయవాడ-భద్రాచలం-విజయవాడ, కాచిగూడ-బోధన్, బోధన్-మహబూబ్నగర్, గుంతకల్-రాయ్చూర్ రైళ్లను రద్దుచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.